News February 18, 2025

వైఎస్ జగన్ దళిత ద్రోహి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడి కేసులో విజయవాడ సబ్ జైల్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అని చెప్పే నాయకుడు ఎస్సీల పైన దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.

Similar News

News February 21, 2025

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని వినతి

image

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులును అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు కోరారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అగ్రి గోల్డ్ ఏజెంట్లు పడుతున్న బాధలు విన్నవించారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రెష్, అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి పాల్గొన్నారు.

News February 21, 2025

అనంతపురం వైసీపీ నేతకు అంతర్జాతీయ అవార్డు

image

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిట్లూరి రమేశ్ గౌడ్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దుబాయ్‌లో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ నుంచి అవార్డును అందుకున్నారు. సామాజిక, రాజకీయ, వ్యక్తిగత కేటగిరిలో అవార్డు దక్కినట్లు ఆయన తెలిపారు. చిట్లూరి రమేశ్ ఇటీవలే వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయనకు పలువురు వైసీపీ నేతలు అభినందనలు చెప్పారు.

News February 21, 2025

యూట్యూబర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

image

గుంతకల్లు మండలం బుగ్గ సంగాల గ్రామ సమీపంలో 2 రోజుల క్రితం యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని కసాపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ట్రాక్టర్, బైకు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసినట్లు తెలిపారు. భూ వివాదంతోనే హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.

error: Content is protected !!