News February 18, 2025

బయట ఫుడ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా?

image

రెస్టారెంట్‌ ఫుడ్ తినడంలో చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు ముందున్నాయి. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీనికి డా.సుధీర్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ‘ఇందులో మేము సింగపూర్ & ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం అత్యంత ఆరోగ్యకరమైన ఎంపిక. బయట ఫుడ్ వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు’ అని తెలిపారు.

Similar News

News January 13, 2026

మన ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఆ ఫీలింగే వేరు!

image

సంక్రాంతికి పట్టణాలన్నీ ఖాళీ అవుతుండగా పల్లెలు సందడిగా మారాయి. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు. అయితే మన ఊరు కొద్ది దూరంలో ఉందనగా కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్, చెరువు, పొలాలు తదితరాలు గుర్తుకొస్తాయి. పండగకి ఊరెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో.. తిరిగొచ్చేటప్పుడు అంతే బాధగా అన్పిస్తుంది కదా?

News January 13, 2026

ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

image

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

News January 13, 2026

పాదాల అందం కోసం

image

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మ‌డమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత‌ శుభ్రం చేసుకుంటే ఫ‌లితం ఉంటుంది. * ఓట్‌మీల్‌, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.