News February 18, 2025
MNCL: MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

రాష్ట్రంలో ఈ నెల 27న జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం, భరోసా, ప్రజల పక్షాన బీజేపీ చేసిన పోరాటం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ గెలుపునకు బాటలు అని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.
News November 22, 2025
ఏలూరు జిల్లాలో యాక్సిడెంట్.. ఒక్కరు మృతి

ఏలూరు జాతీయ రహదారిలోని దుగ్గిరాల సమీపంలో శనివారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్పై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ప్రమాదంలో ఘటన స్థలంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ సిబ్బంది మృతదేహాన్ని ఏలూరు సర్వజన హాస్పిటల్కి తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.
News November 22, 2025
బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్కి వెళ్లి చాలామంది స్కిన్కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.


