News February 19, 2025

జగిత్యాల కలెక్టర్‌తో చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ 

image

ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై మంగళవారం జగిత్యాల కలెక్టర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా కొనసాగించాలని, రైతు భరోసాపై గ్రీవెన్స్ సెల్‌ను జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

image

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

News November 13, 2025

ASF: ఈ-పాస్ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోండి

image

జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతున్న బీసీ (BC), ఈబీసీ (EBC) విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమాదేవి తెలిపారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News November 13, 2025

ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ బుధవారం అధికారులను ఆదేశించారు. రహదారులు, స్వదేశీ దర్శన్, నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్, ఆక్వాపార్క్ పనులపై కలెక్టరేట్ న్యూ వీసీ హాల్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూర్యలంక బీచ్, ఆక్వాపార్క్ అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.