News February 19, 2025
కరీంనగర్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో యాసంగి పంటకు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వేసవిలో నగరంతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 21, 2025
కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం వెబ్సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. కరీంనగర్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
News February 21, 2025
KNR: జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

వేసవి నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 33.0℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో 19.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
News February 21, 2025
KNR: బండి సంజయ్పై ఉన్న కేసు కొట్టేసిన కోర్టు!

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కేంద్రమంత్రి బండి సంజయ్ దండుపాళ్యం ముఠాతో పోల్చారంటూ 2023లో నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసుపై గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తుది విచారణ జరిపి బండి సంజయ్ని నిర్దోషిగా ప్రకటించి, కేసు కొట్టి వేసింది.