News February 19, 2025
కుంభమేళాలో కిషన్ రెడ్డి కుటుంబం

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లో పవిత్రస్నానం ఆచరించారు. మంగళవారం సాయంత్రం భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఆయన త్రివేణీ సంగమానికి చేరుకున్నారు. సనాతన ధర్మంపై రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకు కుంభమేళాకు తరలివస్తున్న భక్తజనమే నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. త్రివేణీ సంగమంలో స్నానం చేయడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
APPLY NOW: NIPHMలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (<
News November 14, 2025
‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ రివ్యూ

పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు బిడ్డను కనే ప్రయత్నంలో ఎదురైన ఆరోగ్య సమస్యను ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర కథ. బోల్డ్ పాయింట్ను డైరెక్టర్ సంజీవ్ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో చూసేలా తీశారు. విక్రాంత్, చాందినీ చౌదరి పాత్రలు, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ కామెడీ ప్లస్. కొన్ని సాగదీత సన్నివేశాలు, రొటీన్ అనిపించే కథ, అక్కడక్కడా ఎమోషన్స్ తేలిపోవడం మూవీకి మైనస్ అయ్యాయి.
రేటింగ్: 2.5/5
News November 14, 2025
ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్లో ఉంది.


