News February 19, 2025
కుంభమేళాలో కిషన్ రెడ్డి కుటుంబం

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లో పవిత్రస్నానం ఆచరించారు. మంగళవారం సాయంత్రం భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఆయన త్రివేణీ సంగమానికి చేరుకున్నారు. సనాతన ధర్మంపై రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకు కుంభమేళాకు తరలివస్తున్న భక్తజనమే నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. త్రివేణీ సంగమంలో స్నానం చేయడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.
Similar News
News January 26, 2026
నేషనల్ అవార్డ్ విన్నర్తో మోహన్లాల్ కొత్త సినిమా

రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్ లాల్ తన 367వ సినిమాను ప్రకటించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని ‘శ్రీ గోకులం మూవీస్’ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ‘దృశ్యం 3’తో రాబోతున్న మోహన్ లాల్.. మమ్ముట్టితో కలిసి ‘పేట్రియాట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ గంగా నేపథ్యంలో సాగే థ్రిల్లర్ అని సమాచారం.
News January 26, 2026
మంత్రులు భేటీ అయితే తప్పేముంది: మహేశ్

TG: నలుగురు మంత్రులు అత్యవసరంగా <<18968187>>సమావేశమయ్యారనే<<>> వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు పరిపాలనా అంశంలో మంత్రులు భేటీ అయితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఈ విషయంగానే సమావేశం నిర్వహించినట్లు భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక హైకమాండ్తో చర్చిస్తామని తెలిపారు.
News January 26, 2026
పాక్ను ఇండియన్స్ ఉతికి ఆరేస్తారు.. T20 WCపై మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

ప్రస్తుతం T20ల్లో టీమ్ ఇండియా ఫామ్ను చూసి ఆడటానికి ఏ జట్టైనా భయపడుతుందని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఇలాంటి బాదుడును తానెప్పుడూ చూడలేదంటూ న్యూజిలాండ్ సిరీస్లో ఇండియన్ ప్లేయర్స్ విధ్వంసకర బ్యాటింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాక్ T20 WCకు రాకపోవడమే మంచిదని.. లేదంటే ఉతికి ఆరేస్తారని సరదాగా అన్నారు. కొలంబోలో సిక్స్ కొడితే మద్రాస్లో పడుతుందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.


