News February 19, 2025
ఖమ్మంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 14, 2025
NZB: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి

NZBలో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు..పెద్దపల్లి, జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు సంపత్, చిరంజీవి కలిసి గల్ఫ్కు కొందరిని పంపించారు.తీరా అక్కడికి వెళ్లిన వారికి పని లేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్,చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.
News March 14, 2025
NZB: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి

NZBలో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు..పెద్దపల్లి, జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు సంపత్, చిరంజీవి కలిసి గల్ఫ్కు కొందరిని పంపించారు.తీరా అక్కడికి వెళ్లిన వారికి పని లేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్,చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.
News March 14, 2025
సీతానగరం: ‘ఎలిఫెంట్ జోన్ మా కొద్దు’

నివాస ప్రాంతాల సమీపంలో ఎలిఫెంట్ జోన్ మా కొద్దని సీపీఎం నాయకులు కొల్లు గంగు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం మండలంలో ఎలిఫెంట్ జోన్ పెట్టడం అంటే ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఎక్కడ నుంచి వచ్చిన ఏనుగులను అక్కడికి తరలించకుండా జనావాసాల మధ్య పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఎలిఫెంట్ జోన్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.