News February 19, 2025

నరసాపురం: వేధింపులు భరించలేక యువతి సూసైడ్

image

నరసాపురంలోని కొప్పర్రుకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఇన్‌ఛార్జ్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. పోలీసుల కథనం.. ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న యువతిని అదే ప్రాంతానికి చెందిన యు. సాలోమోను ప్రేమపేరిట అసభ్యంగా ప్రవర్తించాడు. అతనితో పాటు అతని భార్య,చెల్లి వచ్చి దుర్భాషలాడడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఎస్సై తెలిపారు.

Similar News

News January 12, 2026

ఒకేరోజు 7 చిత్రాల ట్రైలర్స్ విడుదల చేస్తా: నిర్మాత తుమ్మలపల్లి

image

ఈ ఏడాది ఆగస్టు 15 లోపు 15 చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. సోమవారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఒకేసారి ప్రారంభించిన 15 చిత్రాలలో ఇప్పటికే 7 చిత్రాల షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. భీమవరం టాకీస్ పతాకంపై రూపొందిన ఈ 7చిత్రాల ట్రైలర్లను కూడా ఒకేరోజు ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.

News January 12, 2026

ప.గో: అర్జీదారులకు గమనిక.. గ్రీవెన్స్‌ వేదిక మార్పు

image

ప్రతి సోమవారం గొల్లలకోడేరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమం గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. గొల్లలకోడేరు కార్యాలయానికి రావాల్సిన అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ వినతులు అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.

News January 12, 2026

ప.గో జిల్లాలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్

image

భీమవరం కలెక్టరేట్‌, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.