News February 19, 2025

మెదక్: వైద్యం చేయించలేక భర్తను చంపేసింది

image

భర్తను అల్లుడితో కలిసి భార్య హత్యచేసింది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా పాపన్నపేట మం. బాచారం వాసి ఆశయ్య(45) ఈనెల 15న పొలంలో పనిచేస్తూ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేశ్ కలిసి ఆదివారం అర్ధరాత్రి హత్య చేసింది. సహజమరణంగా నమ్మించే ప్రయత్నించగా మెడపై గాయలు చూసిన మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News September 15, 2025

శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

image

అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 81 అర్జీలు స్వీకరించామన్నారు. ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.

News September 15, 2025

అనంత: పోలీస్ గ్రీవెన్స్‌కు 121 అర్జీల రాక

image

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)కు అనూహ్య స్పందన లభించినట్లు SP జగదీశ్ పేర్కొన్నారు. మొత్తం 121 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, రస్తా తగాదాలపై వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని SP హామీ ఇచ్చారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ డేకు 334 అర్జీలు వచ్చాయని జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు.

News September 15, 2025

విశాఖ పీజీఆర్ఎస్‌కు 329 వినతులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజలు వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 329 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 92, జీవీఎంసీకి చెందిన‌వి 88, పోలీసు శాఖ‌కు సంబంధించి 25, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించి 124 ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేషశైలజ ఉన్నారు.