News March 21, 2024

58 ఏళ్ల వయసులో IVFకు అనుమతి ఎలా?

image

దివంగత సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు రెండో బిడ్డకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. సిద్ధూ తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమెకు 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డను కనడానికి 21 నుంచి 50 ఏళ్ల వారికే అనుమతి ఉందని తెలిపింది. దీనిపై నివేదిక సమర్పించాలని లేఖ రాసింది.

Similar News

News October 1, 2024

మ్యాచ్‌లో రోహిత్ ఇచ్చిన సందేశం ఏంటంటే..: KL రాహుల్

image

బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్‌గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.

News October 1, 2024

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News October 1, 2024

రజినీ ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. కాగా రజినీ తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.