News February 19, 2025
చరిత్రలోనే పెద్ద మోసం: మస్క్

అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, ‘చరిత్రలోనే ఇది పెద్ద మోసమని’ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2కోట్లమంది, 200ఏళ్లు దాటిన వారు 2వేలమంది. 369 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నట్లు డేటాబేస్ ఉందని తెలిపారు. మరణించిన వారి సమాచారం (SSA)లో నమోదు చేయకపోవడంతో ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 100ఏళ్లు దాటిన వారు 86వేలు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News September 16, 2025
ACS అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.కోటికి పైగా నగదు, రూ.కోటి విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూ సంబంధిత అంశాలలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 6 నెలలుగా ఆమెపై ప్రత్యేక విజిలెన్స్ సెల్ నిఘా పెట్టినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
News September 16, 2025
పిల్లలకు డైపర్లు వేస్తున్నారా?

పిల్లలకు డైపర్లు వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. *2 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడొచ్చు *ఇంట్లో ఉన్నప్పుడు కాటన్వి, ప్రయాణాల్లో డిస్పోజబుల్ డైపర్లు వాడటం మేలు *డైపర్లను ఎక్కువసేపు మార్చకుండా వదిలేస్తే ఒరుసుకుపోవడం, గజ్జల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది *డైపర్ విప్పాక అవయవాలకు గాలి తగిలేలా ఉండాలి *గోరువెచ్చని నీళ్లతో కడిగేసి సున్నితంగా కాటన్ బట్టతో అద్దాక కొత్తది వేయాలి.
News September 16, 2025
సూర్యను నీరజ్ చోప్రా ఫాలో అవుతారా?

ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు, ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ ఛాంపియన్, పాక్ ప్లేయర్ అర్షద్ నదీమ్ను నీరజ్ ఎదుర్కోనున్నారు. మరి షేక్ హ్యాండ్ విషయంలో SKYని భారత త్రోయర్ ఫాలో అవుతారా అనే చర్చ మొదలైంది.