News February 19, 2025
46 మంది టీడీపీ నేతలపై కేసు కొట్టివేత: ఎస్ఐ సతీశ్

మాచవరం మండలం తురకపాలెం తెలుగుదేశం పార్టీ వర్గీయులపై నమోదైన హత్య కేసును గురజాల అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు కొట్టివేశారని మాచవరం ఎస్ఐ సతీశ్ తెలిపారు. 2019 జూలై 1న తురకపాలెం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఘర్షణ జరిగింది. టీడీపీ వర్గీయులైన షేక్ అల్లావుద్దీన్తో పాటు 46 మందిపై అప్పట్లో కేసు నమోదు అయింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News March 1, 2026
ఖమేనీ హత్య కిరాతకమైన చర్య: పుతిన్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. ఈ హత్య కిరాతకమైన చర్య అని పేర్కొన్నారు. నైతికత, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి ఖమేనీని చంపారని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ఇరాన్ సన్నిహితుడు మసూద్ పెజెష్కియాన్(ప్రెసిడెంట్)కు రాసిన లేఖలో పేర్కొనట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో ఖమేనీ హతమైన విషయం తెలిసిందే.
News March 1, 2026
వేసవి ఆరంభంలోనే పీక్ స్టేజ్కి విద్యుత్ డిమాండ్

TG: వేసవి ఆరంభంలోనే ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే రాష్ట్రంలో విద్యుత్ డిమాండూ పెరిగిపోతోంది. శనివారం 6057 MW గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా నేడు దాన్ని దాటి 6267 MWకు చేరుకుంది. రానున్న కాలంలో ఎండలు మరింత పెరిగి డిమాండూ అధికమయ్యే పరిస్థితి ఉందని NPDCL CMD వరుణ్ రెడ్డి తెలిపారు. అయితే ఇబ్బందులు తలెత్తకుండా డిమాండ్కు తగ్గ విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
News March 1, 2026
RGM: April-1 వరకు నిషేధాజ్ఞలు: CP

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి PDPL- MNCL జిల్లాలలో April-1 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదన్నారు. అలాగే డ్రోన్లు, DJసౌండ్స్ కు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు.


