News March 21, 2024

18 ఏళ్లు నిండే వారు మర్చిపోవద్దు

image

ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండే యువత ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కు పొందితే రానున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చని పేర్కొంది. నిన్న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా.. మిగతా దశల్లో జరిగే ఎన్నికల నామినేషన్ల చివరి తేదీలు ఏప్రిల్ 1 తర్వాత ఉంటాయి. దీంతో ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారికి EC ఈ అవకాశం కల్పించింది. ఓటు హక్కు దరఖాస్తు కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 1, 2024

మ్యాచ్‌లో రోహిత్ ఇచ్చిన సందేశం ఏంటంటే..: KL రాహుల్

image

బంగ్లాతో రెండో టెస్టులో రెండున్నర రోజుల ఆట వర్షార్పణమైనప్పటికీ టీమ్ ఇండియా అద్భుత ఆటతో విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడే దీనిక్కారణమని కేఎల్ రాహుల్ తెలిపారు. ‘ఎంత వీలైతే అంత ట్రై చేసి గెలవడానికే చూడాలని 4వ రోజు ఆట మొదలయ్యే సమయానికి రోహిత్ క్లియర్‌గా చెప్పారు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఆటగాళ్లకు స్వేచ్ఛ లభించింది. వికెట్లు పడుతున్నా ఆ దూకుడును కొనసాగించి విజయం సాధించాం’ అని వెల్లడించారు.

News October 1, 2024

రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్

image

AP: రేషన్ కార్డుదారులకు ఇకపై బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా, దీపావళి పండుగలు, నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150 వరకు ఉండగా రూ.67కి, పంచదార రూ.50 ఉండగా అరకిలో రూ.17కి ఇవ్వనుంది. వీటితో పాటు గోధుమపిండి, రాగులు, జొన్నల్ని సైతం రేషన్‌లో అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News October 1, 2024

రజినీ ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని చెప్పారు. కాగా రజినీ తీవ్రమైన అనారోగ్యంతో నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.