News February 19, 2025

27న కాకినాడ జిల్లాలో సెలవు

image

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News January 7, 2026

రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా రామాంజనమ్మ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా లేపాక్షి మండలానికి చెందిన రామాంజనమ్మను TDP అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమెకు ఉత్తర్వులు అందాయి. రామాంజనమ్మ మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత. కాగా, ఆమె ZPTCగా కూడా పనిచేశారు. ఇటీవల TDPలో రాష్ట్ర మహిళా కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఆమె సేవలను గుర్తించిన అధిష్ఠానం రామాంజనమ్మను ఏసీసీ కమిషన్ సభ్యురాలుగా ఎంపిక చేసింది.

News January 7, 2026

రక్తమే రంగుగా.. జగన్ చిత్రపటం గీసిన అభిమాని!

image

ధవళేశ్వరానికి చెందిన కళాకారుడు మిరప రమేష్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా రమేష్ తన రక్తంతో ఆయన చిత్రపటాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు చొరవతో తాడేపల్లిలో జగన్‌ను కలిసిన రమేష్.. తాను గీసిన చిత్రాన్ని స్వయంగా చూపించారు. యువకుడి ప్రతిభను, అభిమానాన్ని చూసి ముచ్చటపడ్డ జగన్.. అతడిని ఆత్మీయంగా పలకరించి అభినందనలు తెలిపారు.

News January 7, 2026

మళ్లీ అదే సెంటిమెంట్‌ ఫాలో కానున్న నాగార్జున!

image

రా కార్తీక్ డైరెక్షన్‌లో సినీ హీరో నాగార్జున 100వ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీని నాగార్జునకు కలిసొచ్చిన డేట్ మే 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘విక్రమ్‌’, ‘మనం’ ఇదే తేదీన రిలీజై విక్టరీ కొట్టాయి. తాజా సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో కానున్నారని టాక్. ఈ చిత్రానికి ‘100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.