News February 19, 2025

NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

image

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.

Similar News

News December 8, 2025

EC షెడ్‌లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

image

EC(ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్) షెడ్‌లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్‌లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.

News December 8, 2025

చివ్వెంల: తల్లికి సేవ చేసిన బిడ్డ కోతి: ముల్లులు తీసిన వైనం

image

చివ్వెంల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం బయట ఒక చెట్టుపై ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం వెళ్లొచ్చిన తల్లి కోతి చెట్టుపై కూర్చోగా, దాన్ని గమనించిన బిడ్డ కోతి పరిగెత్తి తల్లి ఒడిలో కూర్చుంది. తల్లి కోతి ముఖానికి గుచ్చుకున్న ముల్లులను చూసి చలించిపోయిన బిడ్డ కోతి, చాలాసేపు బాధపడుతూ ఆ ముల్లులను తీసింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానిక ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు.

News December 8, 2025

నరసరావుపేట: రైల్వే ట్రాక్‌‌లపై నిత్యం మృత్యు ఘోష

image

నరసరావుపేట రైల్వే PS పరిధిలో ఈ ఏడాది JAN-DEC మధ్యలో 19 సూసైడ్‌లు, 20 ప్రమాదాలు జరిగాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ విఫలం, అనారోగ్యంతో కొందరు, ప్రమాదవశాత్తూ మరికొందరు రైల్వే ట్రాక్‌లపై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లేదనుకొనిని ప్రాణాలు రైలు చక్రాల కింద నలిగిపోతున్నాయి. ఇలా ఏదో ఒక రూపంలో పట్టాలపై మృత్యు ఘోష నిత్యం వినిపిస్తోంది. కొందరు మృతుల ఆధారాలు కూడా దొరకడం లేదు.