News February 19, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.
Similar News
News February 22, 2025
ముస్లింలను త్వరగా పంపించే ఆలోచన లేదు: కర్ణాటక మంత్రి

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు పని నుంచి త్వరగా ఇంటికెళ్లేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోనూ ఆ సదుపాయాన్ని కల్పించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు. అయితే, తమకు అలాంటి ఆలోచనేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. అలాంటి ప్రతిపాదననేమీ చూడట్లేదని, ఇతర రాష్ట్రాలేం చేస్తున్నాయన్నది తమకు అనవసరమని ఆయన పేర్కొన్నారు.
News February 22, 2025
మహాసముద్రాల్లో వింత ఘటనలు.. ఏదో జరుగుతోందా?

AP తీర ప్రాంతాల్లో వేలాది మృత తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. ఆస్ట్రేలియాలో 150 కిల్లర్ వేల్స్ ఒడ్డుకి చేరి విలవిల్లాడుతూ మరణించాయి. అట్టడుగు లోతుల్లో చీకట్లో బతికే యాంగ్లర్, ఓర్ చేపలు లోతు తక్కువ నీటిలోకి వస్తున్నాయి. ఒక ఓర్ చేప స్పెయిన్లో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీంతో మహాసముద్రాల్లో ఏదో జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. రాబోతున్న ఘోర విపత్తుకి ఇవి సంకేతాలా అంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News February 22, 2025
‘బాయ్కాట్ ఓయో’ ట్రెండింగ్.. వివరణ ఇచ్చిన సంస్థ

<<15536319>>తమ ప్రకటనపై ‘బాయ్కాట్ ఓయో’ ట్రెండ్<<>> అవుతుండటంతో ఓయో స్పందించింది. ‘అయోధ్య, వారణాశి, ప్రయాగరాజ్ తదితర పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశాల్లోనూ మేం సేవలందిస్తున్నాం. ఆ విషయాన్ని చెప్పడమే ఆ యాడ్ వెనుక ఉద్దేశం తప్ప మనోభావాలను దెబ్బతీయడం కాదు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని వృద్ధి చేయాలనేది మా లక్ష్యం. పురాతన సంప్రదాయాలకు నెలవైన మన దేశంలోని విశ్వాసాల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది’ అని వివరణ ఇచ్చింది.