News February 19, 2025

ఏలూరు: జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం

image

ఏలూరు జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్‌గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 5, 2025

డీఎస్సీ నియామక ఉత్తర్వులపై ఆదేశాలు

image

AP: ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్షించారు. డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా UGC నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చూడాలని సూచించారు. 2024-25కి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

News July 5, 2025

ములుగు: డీసీసీ బ్యాంక్ బ్రాంచి మార్పు

image

ములుగులోని డీసీసీ బ్యాంకు బ్రాంచి తహశీల్దార్ ఆఫీస్ కార్యాలయం రోడ్ నుంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మార్చినట్లు బ్యాంకు మేనేజర్ తిరుపతి ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి ములుగు బ్రాంచి సేవలు కూరగాయల మార్కెట్ రోడ్డులోని ఎక్సైజ్ ఆఫీస్ పక్కన ఇంటి నంబరు 6,181లో నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని మేనేజర్ కోరారు.

News July 5, 2025

తెలంగాణ దేశానికి మోడల్‌గా నిలిచింది: MP కడియం

image

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన సామాజిక న్యాయ సమర భేరి సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ ఒక్కటే శ్రీరామ రక్ష అని, రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.