News March 21, 2024
కరీంనగర్: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

బైకు చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్సై సురేందర్ కథనం ప్రకారం.. గోపాల్రావుపేటకు చెందిన అరవింద్తో కలిసి రాకేశ్(21) మంగళవారం రాత్రి తన బావ బర్త్డే వేడుకలు జరుపుకొన్నారు. అక్కడి నుంచి చొప్పదండిలో భోజనం చేసేందుకు ఇద్దరు బైకుపై లక్ష్మీపూర్ మీదుగా బయలుదేరారు. వెంకట్రావుపల్లి శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. క్షతగాత్రులను KNR ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే రాకేశ్ మృతి చెందాడు.
Similar News
News October 23, 2025
కరీంనగర్: సిటిజన్ సర్వేకు ప్రజల స్పందన

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. భారతదేశ స్వాతంత్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం గతవారం ప్రారంభించిన సర్వే ఈ నెల 25న ముగుస్తుంది. వెబ్సైట్ను సందర్శించి సలహాలు సూచనలు తెలపాలని కలెక్టర్ సూచించారు.
News October 23, 2025
కరీంనగర్: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సిపి గౌష్ ఆలం తెలిపారు. ‘ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర’, ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండాలి’ అనే అంశాలపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఉంటాయన్నారు. https://forms.gle/jaWLdt2yhNrMpe3eA ఈ లింకులో ఈనెల 28 వరకు అప్లోడ్ చేయాలన్నారు. ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు.
News October 23, 2025
కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, గతంలో KNR పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు ఈ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. DCC అధ్యక్ష పదవి కోసం మొత్తం 36 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.