News February 19, 2025

ఎక్స్‌ట్రా టికెట్లు ఎందుకు అమ్మారు?: ఢిల్లీ HC ఆగ్రహం

image

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఇటీవల తొక్కిసలాట జరిగి 18మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు CJI ధర్మాసనం విచారణ జరిపింది. కోచ్‌లో పట్టే ప్రయాణికుల కంటే రైల్వే అదనపు టికెట్లు ఎందుకు అమ్ముతోందని మండిపడింది. కోచ్‌లో ప్రయాణికుల పరిమితిపై, అనుమతి లేకుండా కోచ్‌ల్లోకి ప్రవేశిస్తున్న వారిపై ఏ చర్యలు తీసుకుంటున్నారని రైల్వేస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Similar News

News January 15, 2026

హైదరాబాద్ కెప్టెన్‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌

image

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ కెప్టెన్‌గా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించింది. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లలో సిరాజ్ జట్టును నడిపించనున్నారు. రాహుల్ సింగ్‌ను VCగా ఎంపిక చేశారు. VHTలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్‌రావ్ పేరాల సైతం జట్టులో ఉన్నారు.

News January 15, 2026

పండక్కి అల్లుళ్లను ఇంటికి ఎందుకు పిలుస్తారు?

image

అల్లుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆయనకు చేసే మర్యాదలు ఆ నారాయణుడికే చెందుతాయని, దీనివల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలాగే, పంట చేతికొచ్చే సమయంలో కూతురు, అల్లుడిని పిలిచి విందులు, వస్త్రదానాలతో సత్కరించడం ద్వారా 2 కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది. అందుకే కొత్త అల్లుడు సంక్రాంతికి అత్తవారింటికి రావడం మన సంస్కృతిలో మధురమైన సంప్రదాయంగా మారింది.

News January 15, 2026

అంటురోగాల వ్యాప్తిని గుర్తించేందుకు వెబ్‌లింక్

image

AP: అపరిశుభ్రత, కలుషిత తాగునీటితో వాంతులు, విరేచనాల వంటి అంటురోగాలు ప్రబలుతుంటాయి. వీటిపై స్థానిక సిబ్బందికి, వారినుంచి పై స్థాయికి సమాచారం చేరడంలో జాప్యంతో సమస్య జటిలం అవుతోంది. దీని నివారణ కోసం ప్రజలను భాగస్వాములను చేసేలా వైద్యశాఖ IHIP వెబ్ లింక్‌ను ఏర్పాటుచేసింది. అంటురోగాల సమాచారాన్ని ఫొటోలతో సహా వారు అందులో పొందుపర్చవచ్చు. మరిన్ని వివరాలకు <>క్లిక్<<>> చేయండి.