News February 19, 2025

యాదాద్రి కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ హనుమంతరావును యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Similar News

News January 16, 2026

SRPT: కలెక్టరేట్‌లో మున్సిపల్ వార్డుల వారిగా డ్రా

image

మున్సిపల్ CDMA ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో ఈ నెల 17న కలెక్టర్ సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్‌ల డ్రా తీయనున్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలమైన రిజర్వేషన్ రావాలని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గతంలో గెలిచిన వారితో పాటు, ఈసారి కొత్తగా పోటీ చేయాలనుకునే వారు కూడా ఈ డ్రా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News January 16, 2026

కనకాంబరంలో పిండి నల్లి నివారణకు సూచనలు

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News January 16, 2026

ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

image

మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతిచెందాడు. నెల్లూరుకు చెందిన మైనార్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జాఫర్ షరీఫ్(54) కారులో విజయవాడ నుంచి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. జాఫర్ షరీఫ్‌ను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.