News February 19, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

image

TG: పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. కేసు దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ (మార్చి 3) వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Similar News

News March 15, 2025

షాకింగ్.. పెళ్లయిన వారిలోనే ఆ సమస్య ఎక్కువ

image

పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్‌తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.

News March 15, 2025

బుమ్రా తెలివిగా ఆలోచించాలి: మెక్‌గ్రాత్

image

గాయాల విషయంలో భారత బౌలర్ బుమ్రా తెలివిగా వ్యవహరించాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మెక్‌గ్రాత్ సూచించారు. ‘తను యువకుడు కాదు. వయసు పెరిగే కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు గాయాల ప్రమాదం మరింత ఎక్కువ. నేను తక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడిని కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లు అప్రమత్తంగా ఉండాలి. జిమ్‌లో శరీరాన్ని దృఢపరచుకోవాలి. భారత్‌కు అతడి సేవలు అత్యవసరం’ అని పేర్కొన్నారు.

News March 15, 2025

సిRAW: భావోద్వేగాలే.. బాగోగుల్లేవిక్కడ

image

ఎన్నికలంటే ఐదేళ్ల ప్రోగ్రెస్ కార్డుతో ప్రచారాలుండాలి. ఇటీవల పాలకులు ప్రాంతం, జాతి, మతం, భాష అని ఎమోషనల్ కార్డు ప్లే చేస్తున్నారు. భావోద్వేగ డ్రామాతో పోల్ ఘట్టం గట్టెక్కేస్తున్నారు. ప్రశ్నించాల్సిన విపక్షాలూ కుర్చీ కోసం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అని పండగ సేల్‌లా ఆఫర్లిస్తున్నాయి. ప్రజల కోసం ఫలానా చేశామని చెప్పట్లేదు. ఎవరికి పవర్ వచ్చినా ప్రసాదం తినలేని ప్రజాస్వామ్య దేవుళ్లకే ఎగనామం. ఏమంటారు ఫ్రెండ్స్?

error: Content is protected !!