News February 19, 2025

కామారెడ్డి: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:విద్యాశాఖ కమిషనర్ 

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News March 15, 2025

టెస్టు క్రికెట్‌కి ‘హ్యాపీ బర్త్ డే’

image

టెస్టు క్రికెట్ మొదలై నేటికి 148ఏళ్లు పూర్తయింది. 1877, మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆ దేశానికి, ఇంగ్లండ్‌కు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆల్ఫ్రెడ్ షా(ENG) తొలి బంతి వేయగా, ఛార్ల్స్ బ్యానర్‌మ్యాన్(AUS) ఆడారు. ఆయనే తొలి టెస్టు పరుగు, తొలి సెంచరీ చేశారు. తొలి వికెట్‌ను అలాన్ హిల్(ENG) తీశారు.

News March 15, 2025

KNR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన: KTR

image

కాంగ్రెస్ ప్రజాపాలనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన అని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంపద సృష్టిస్తాం , ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికిన నాయకులు.. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది అని అన్నారు.

News March 15, 2025

షాకింగ్.. పెళ్లయిన వారిలోనే ఆ సమస్య ఎక్కువ

image

పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్‌తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!