News February 19, 2025
LRS.. మార్చి 31 వరకు గడువు

TG: లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆలోగా క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనుంది. LRSపై మంత్రులు నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 4 ఏళ్లలో ప్లాట్లు కొన్నవారికి, 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకూ అవకాశం కల్పించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.
Similar News
News November 10, 2025
JE, SI పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన SSC

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 10, 2025
వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు: గంభీర్

హెడ్ కోచ్గా తనకు జట్టు ప్రదర్శనే ముఖ్యమని గంభీర్ తెలిపారు. ‘క్రికెట్ వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించింది కాదని నమ్ముతాను. మేము ODI సిరీస్ ఓడిపోయాం. కోచ్గా ఇండివిడ్యువల్ గేమ్ను మెచ్చుకోవచ్చు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా సిరీస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోలేను. T20 సిరీస్ వేరే.. అందులో గెలిచాం. దానిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ WCకి ముందు మేమనుకున్న చోట లేము’ అని తెలిపారు.
News November 10, 2025
₹750 కోట్లతో నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్: మంత్రి

AP: తొలిసారిగా ‘అపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి’ రాష్ట్రంలో ఏర్పాటు కానుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ₹750 కోట్లతో కేంద్రం నెలకొల్పే దీనిలో బ్యాచ్లర్ ఆఫ్ నేచురోపతి యోగా సర్జరీలో 100 సీట్లు, PGలో 20 సీట్ల చొప్పున తొలి ఏడాదిలో ఉంటాయన్నారు. దీనికోసం 40 ఎకరాలు కావాలని కేంద్రం లేఖ రాసిందని చెప్పారు. 450 పడకల నేచురోపతి ఆసుపత్రీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.


