News February 19, 2025
జీబీఎస్తో గుంటూరు మహిళ మృతి

గిలియన్ బారో సిండ్రోమ్ (GBS)తో గుంటూరు నెహ్రూనగర్కి చెందిన మహిళ మరణించారు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతూ గత కొద్దిరోజుల క్రితం నెహ్రూనగర్కి చెందిన గౌర్ జాన్ (65) జీజీహెచ్లో చేరారు. మొదటి మరణం సంభవించినప్పుడు జీబీఎస్ అంత ప్రమాదం ఏమీ కాదని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి చెప్పారు. కానీ ఇప్పుడు నగరానికి చెందిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో గుంటూరు నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
Similar News
News March 6, 2026
GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

ప్రజలు రైల్వే క్రాసింగ్లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.
News March 6, 2026
GNT: రైల్వే గేట్ మూసినా ముందుకెళ్తే.. ప్రమాదం తప్పదు..!

ప్రజలు రైల్వే క్రాసింగ్లు దాటేటప్పుడు అధికారుల సూచనలు పాటించి నిబంధనలకు లోబడి ప్రవర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చని గుంటూరు డివిజన్ DSO కీర్తి తెలిపారు. గేట్ మూసిన తర్వాత కూడా కొందరు నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ–గుంటూరు–తెనాలి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో ప్రతి ఏడాది 30–60 రైల్వే సంబంధిత మరణాలు నమోదవుతున్నాయి.
News March 5, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని BC సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని గురువారం సచివాలయంలో ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.


