News February 19, 2025

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

అద్దంకి మండలం వేణుగోపాలపురం సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. కట్టెల ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై ఉన్న తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ఏనికపాటి ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది అతన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Similar News

News March 12, 2025

కార్య‌క్ర‌మాల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి మూడో శ‌నివారం చేప‌డుతున్న‌ స్వ‌చ్ఛ‌తా హీ సేవా కార్య‌క్ర‌మాలపై చర్చించారు. నిర్వ‌హ‌ణపై బుధ‌వారం ఉద‌యం త‌న ఛాంబ‌ర్ నుంచి నిర్వ‌హించిన‌ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

News March 12, 2025

పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ టైల్స్‌ను గమనించారా?

image

రైల్వే & మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్, ఫుట్‌పాత్, ఆసుపత్రులు వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పసుపు రంగులో ఉండే స్పెషల్ టైల్స్‌ కనిపిస్తుంటాయి. ఇవి అక్కడ ఎందుకున్నాయో తెలుసా? వీటిని జపాన్ వ్యక్తి సెయీచీ మియాకే తన బ్లైండ్ ఫ్రెండ్ కోసం డిజైన్ చేయగా ఇప్పుడు ప్రపంచమంతా వినియోగిస్తున్నారు. ఈ టైల్స్‌లో డాట్స్ & స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఉంటే ముందుకు వెళ్లొచ్చని, డాట్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం.

News March 12, 2025

ODI ర్యాంకింగ్స్: టాప్-3లో గిల్, రోహిత్

image

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్-5లో నిలిచారు. గిల్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ 3, కోహ్లీ 5, శ్రేయస్ పదో ర్యాంకు సాధించారు. బౌలింగ్‌లో కుల్దీప్ 3, జడేజా పదో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్లలో జడేజా పదో స్థానంలో నిలిచారు. ODI, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానాన్ని దక్కించుకుంది.

error: Content is protected !!