News February 20, 2025

యాలాల: ఇసుక అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతాం: జిల్లా ఎస్పీ

image

జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. యాలాల మండల పరిధిలోని కూకట్ గ్రామ సమీపంలోని కాగ్న నదిలో ఇసుక రీచ్లను పరిశీలించారు. ప్రభుత్వ అనుమతులకు సంబంధిత అధికారులచే ఇసుక అనుమతి పొందాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నగేష్ ఎస్ఐ గిరి ఉన్నారు. 

Similar News

News July 5, 2025

ఆదిలాబాద్: ఆత్మహత్య పరిష్కారం కాదు!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారు సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం చిన్నదైన, పెద్దదైన ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. బజార్హత్నూర్‌కు చెందిన తరుణ్, లోకేశ్వరం వాసి దేవన్న, లింగాపూర్‌కు చెందిన సరసత్వీ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

News July 5, 2025

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కళ్యాణి

image

ములుగు జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలుగా పని చేస్తున్న తాడ్వాయి మండలం కామారం పీటీ గ్రామానికి చెందిన కళ్యాణిని నియమించింది. నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కళ్యాణికి జిల్లా, మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

News July 5, 2025

ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన మహబూబాబాద్

image

శుక్రవారం విడుదల చేసిన బాసర త్రిబుల్ ఐటీ(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) ప్రవేశ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా సత్తా చాటింది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 206 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. అందులో మహబూబాబాద్ జిల్లా విద్యార్థులకు 125 సీట్లు వచ్చినట్లు విద్యా శాఖాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.