News February 20, 2025
సిద్దిపేట: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్

అత్యవసర సమయంలో ఒకరికి రక్త దానం చేసి మానవత్వాన్ని ఓ కానిస్టేబుల్ చాటాడు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో ” O ” పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శేఖర్ వెంటనే మిత్ర బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కానిస్టేబుల్కు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News July 9, 2025
NZB: రైతుల్లో చిగురించిన ఆశలు..!

NZB జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతేడాది 4,36,101.21 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 4,37,135 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేటి వరకు 2,37,372 ఎకరాల్లో (58%) నాట్లు వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
News July 9, 2025
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందా?

AP: YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనకబడితే కొత్త మంత్రులు వస్తారని CM CBN ఇవాళ <<17007606>>వార్నింగ్<<>> ఇచ్చారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ మొదలైంది. నాగబాబుకు MLC పదవి దక్కిన తొలినాళ్లలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఉగాది తర్వాత ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారని భావించినా అలా జరగలేదు. తాజాగా CM చేసిన వ్యాఖ్యలతో మంత్రి పదవి కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
News July 9, 2025
వరంగల్ నిట్లో తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం

వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం నిర్వహించారు. బుధవారం నిట్ ఆడిటోరియంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఎంపవరింగ్ రీసెర్చ్ త్రూ షేర్డ్ సైన్టిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే థీమ్తో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాలకు సాంకేతికతను అందించడమే ఐ స్టెమ్ లక్ష్యం అని వక్తలు పేర్కొన్నారు.