News February 20, 2025
వాళ్లకు త్రిబుల్ రైడింగ్ ఫైన్ పడింది 14న: పవర్ కట్పై ఇన్స్పెక్టర్ స్పందన

‘కరెంటోళ్లకు ఫైన్… ట్రాఫిక్ సిగ్నల్స్కి పవర్ కట్’ Way2News కథనంపై మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు స్పందించారు. ఈనెల 14న విద్యుత్ సిబ్బంది త్రిబుల్ రైడింగ్తో వెళ్లగా ఓల్డ్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ విధించినట్లు చిత్రం పంపారు. అగ్ని ప్రమాదం జరిగింది 17న అన్నారు. ఆరోజు ఫైన్ వేయలేదు, విద్యుత్ సిబ్బంది సిగ్నల్స్, ట్రాఫిక్ స్టేషన్కు పవర్ కట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
Similar News
News November 5, 2025
మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 5, 2025
MDK: ఆందోళనకు గురి చేస్తున్న ఆత్మహత్యలు

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఇటీవల యువకుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 ఏళ్ల వయసులోపు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట గ్రామంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు యువకులు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి యువకులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.


