News February 20, 2025
నిర్మల్: అభ్యంతరాల స్వీకరణ గడువు పొడగింపు

వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 24 వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 20 నుంచి 24వ వరకు పొడిగించినట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
ఆసిఫాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 9, 2025
సంగారెడ్డి: ఈ తేదీల్లో పాఠశాలలకు సెలవు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నందున 11, 14, 17 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ఇవ్వాలని అన్నారు.
News December 9, 2025
తూ.గో: ఆరుగురు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పచ్చజెండా రెపరెపలాడుతున్నా.. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై CM చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారి పనితీరుపై ఇంటిలిజెన్స్ నివేదికల ద్వారా సీఎం నిరంతరం సమాచారం సేకరిస్తున్నారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మార్కులు తగ్గిన 37 మంది ఎమ్మెల్యేల జాబితాలో ఆరుగురు ఉమ్మడి జిల్లా నుంచే ఉండటం చర్చనీయాంశంగా మారింది.


