News February 20, 2025
మావల: రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

ద్విచక్రవాహనం అదుపు తప్పి దంపతులు గాయాలపాలైన ఘటన బుధవారం రాత్రి మావల వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాంసీ మండలం పొన్నారికి చెందిన పోషట్టి- ఆశమ్మ లు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మావల సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన క్రషర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా 108 అంబులెన్స్ ఈఎంటీ విశాల్, పైలెట్ ముజ్జఫర్ వారికి ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News January 21, 2026
ఖానాపూర్లో రూ.13కోట్లతో సబ్స్టేషన్ల నిర్మాణం

ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.
News January 21, 2026
ఆదిలాబాద్: రేపు ఇంటర్ ప్రాక్టికల్స్ యథాతథం

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తొలిరోజు ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ తెలిపారు. గురువారం కూడా ప్రాక్టికల్స్ యథావిధిగా కొనసాగుతాయని నాగోబా సెలవు ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ప్రాక్టికల్కు హాజరు కావాలని సూచించారు. కాగా బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల)లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలను DIEO సందర్శించి పరిశీలించారు.
News January 21, 2026
ఆదిలాబాద్: ’23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’

హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జనవరి 23వ తేదీన జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (MPTM) నిర్వహిస్తున్నట్లు DIEO జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశం విద్యార్థుల విద్యా ప్రగతికి కీలకమని, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.


