News February 20, 2025
మావల: రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

ద్విచక్రవాహనం అదుపు తప్పి దంపతులు గాయాలపాలైన ఘటన బుధవారం రాత్రి మావల వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాంసీ మండలం పొన్నారికి చెందిన పోషట్టి- ఆశమ్మ లు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మావల సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన క్రషర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా 108 అంబులెన్స్ ఈఎంటీ విశాల్, పైలెట్ ముజ్జఫర్ వారికి ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 31, 2025
ADB: శిశు మరణాల నివారణకు పని చేయాలి

ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News October 31, 2025
ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమీక్ష

కలెక్టరేట్లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
News October 30, 2025
ఆదిలాబాద్: ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


