News March 21, 2024

సూర్యాపేట: బ్యాంకు అధికారిపై కేసు నమోదు

image

రుణాల పేరుతో రూ.2.82 కోట్లు దోచుకున్న తాళ్లసింగారానికి చెందిన ఎస్బీఐ మేనేజర్ హరిప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు నూతనకల్ ఎస్సై సైదులు తెలిపారు. ప్రస్తుత మేనేజర్ రవీందర్ ఫిర్యాదు మేరకు.. నకిలీ రైతులు, వ్యాపారస్థులు, మహిళా సంఘాల పేరుతో రుణాలు మంజూరు చేసి తన ఖాతాలోకి నిధులు మళ్లించుకొని రూ.కోట్ల బ్యాంకు సొమ్ము కాజేసినట్లు రుజువు కావడంతో హరిప్రసాద్‌తో పాటు అతనికి సహకరించిన 14 మందిపై కేసు నమోదు చేశారు.

Similar News

News September 7, 2025

రేపటి నుంచి నల్గొండలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్..!

image

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 8 నుంచి NLG పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి పొందుతున్న మహిళల ఆధ్వర్యంలో వివిధ రకాల వంటల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News September 7, 2025

NLG: మాతృ సంస్థలోకి మళ్లీ..!

image

వీఆర్ఏలు, వీఆర్వోలు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చారు. ప్రభుత్వం వారిని గ్రామ పాలనాధికారులుగా కొత్తగా నియమించింది. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాయించారు. జిల్లాలో 275 క్లస్టర్లు ఉంటే 276 మంది జీపీవోలుగా ఎంపిక చేసింది. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం జీపీఏలకు వారి ర్యాంకులను బట్టి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

News September 7, 2025

NLG: జిల్లా నుంచి 85 మంది ఎంపిక

image

నల్గొండలోని ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాల్లో నిర్వహించిన ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ (19 విభాగాల్లో) 135 మంది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొనగా 85 మంది రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ. అక్బర్అలీ తెలిపారు. ఎంపికైన వారు ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ లో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.