News February 20, 2025

అన్నమయ్య: YS జగన్‌పై కేసు.. వైసీపీ నేత ఫైర్ 

image

మిర్చి రైతుల సమస్యలపై పోతే కేసు పెడతారా? అని ఇదెక్కడి న్యాయమని వైసీపీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ సుగవాసి శ్యాంకుమార్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మంచి పద్ధతి కాదని ఖండించారు. జగన్‌పై కేసు నమోదుపై బుధవారం రాత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 17, 2025

మైథాలజీ క్విజ్ – 8 సమాధానాలు

image

1. మైథిలి అంటే ‘సీతాదేవి’. మిథిలా నగరానికి రాజైన జనకుడి పుత్రిక కాబట్టి ఆమెను మైథిలి అని పిలుస్తారు.
2. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ‘ధృష్టద్యుమ్నుడు’. ఆయన ద్రౌపదికి సోదరుడు.
3. ‘పూతన’ అనే రాక్షసిని చంపింది శ్రీకృష్ణుడు.
4. విష్ణువు శయనించే పాము పేరు ‘ఆది శేషుడు’. ఈ సర్పానికి ‘అనంత’ అనే పేరు కూడా ఉంది.
5. బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉంది. <<-se>>#mythologyquiz<<>>

News September 17, 2025

కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్‌పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.

News September 17, 2025

మేడారానికి ఓకే విడతలో రూ.150 కోట్లు: సీతక్క

image

ములుగు జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతరకు ఒకే విడతలో రూ.150 కోట్లు, రోడ్లకు రూ.50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ములుగు పట్టణంలో పంచాయతీ రోడ్లకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అధికారులు ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.