News March 21, 2024

ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగానికి తాళం!

image

ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఎక్స్-రే మూడు రోజుల నుంచి పని చేయడం లేదు. దీంతో టెక్నీషియన్లు తాళం వేశారు. అప్పటి నుంచి అత్యవసర రోగులను ఓపీ విభాగంలోని రేడియాలజీకి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఓపీ రేడియాలజీ విభాగం దూరంగా ఉండటం వల్ల రాత్రి వేళ ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందడం లేదు. ఈ విషయంపై అధికారులు స్పందించి ఎక్స్-రే యంత్రాన్ని మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.

Similar News

News July 5, 2024

వరంగల్: ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

image

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసిన సైబర్‌ నేరస్థుడిని వరంగల్‌ సైబర్‌ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతణ్నుంచి సుమారు రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లాకి చెందిన పొనగంటి సాయితేజ(28) MBA చేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో 2 తెలుగురాష్ట్రాల్లో సుమారు రూ.35 మంది నుంచి రూ.45 లక్షలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

News July 5, 2024

HNK: అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ మంత్రి సమీక్షా సమావేశం

image

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, తదితర అంశాలను సమావేశంలో జిల్లా కలెక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించారు.

News July 5, 2024

BHPL: జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

image

భూపాలపల్లి జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోల సీనియారిటీ జాబితా అందజేయాలని జడ్పీ సీఈఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.