News February 20, 2025
రాష్ట్రంలోనే చదువుల నిలయం మన పాలమూరు: MLA యెన్నం

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు మహబూబ్నగర్ చదువుల కేంద్రం కావాలి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పంచవటి విద్యాలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకోవడానికి మన మహబూబ్నగర్కే రావాలన్నారు. పంచవటి విద్యాలయ యాజమాన్యం విద్యా నిధికి రూ.5 లక్షలు అందజేశారు.
Similar News
News January 14, 2026
పాలమూరు: బొటానికల్ గార్డెన్లో అరుదైన పుట్టగొడుగు

జడ్చర్ల డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ మరో అరుదైన జీవజాతికి నిలయమైంది. ఇక్కడ ‘కాప్రినొప్సిస్ నివియా’ అనే అరుదైన పుట్టగొడుగును ప్రొఫెసర్ సదాశివయ్య బృందం గుర్తించింది. దీని ఫలనాంగాలు మంచు రంగులో ఉండి, మంచుతో కప్పబడినట్లు కనిపిస్తాయి. అందుకే దీనిని ‘స్నోయి ఇంకాంప్’ అని పిలుస్తారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే తన జీవిత చక్రాన్ని ముగిస్తుందని ప్రొఫెసర్ వివరించారు.
News January 14, 2026
పాలమూరు: ఈనాటి ముఖ్య వార్తలు!!

✒T-20 లీగ్.. అదిలాబాద్ పై మహబూబ్ నగర్ ఘనవిజయం
✒అభివృద్ధి కేంద్ర నిధులతోనే: ఎంపీ డీకే అరుణ
✒ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు
✒పలు గ్రామాల్లో క్రీడా పోటీలు
✒పాలమూరు: రోడ్డు ప్రమాదం.. తల్లీకుమార్తె మృతి
✒GDWL:భార్య కాపురానికి రావడంలేదని గొంతు కోసుకున్న భర్త
✒నాగర్కర్నూలు: ఐదుగురు ఏఈఓల సస్పెన్షన్
✒ఈనెల 19 నుంచి జోగులాంబ బ్రహ్మోత్సవాలు
News January 13, 2026
MBNR: సిరి వెంకటాపూర్లో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో అత్యల్పంగా 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకద్రలో 15.5, కొల్లూరులో 17.9, కౌకుంట్ల 18.0, సల్కర్పేటలో 18.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన కొద్దిరోజులతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో జిల్లా ప్రజలకు చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది.


