News March 21, 2024

పాడేరు: పెరుగుతున్న పసుపు ధర

image

గిరిజనులు పండించే పసుపు ధర రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో కిలో పసుపు రూ.45 నుంచి రూ.55 వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది పసుపు ప్రారంభం నుంచి రూ.80 నుంచి 140 వరకు మార్కెట్‌లో వ్యాపారులు పోటీపడి మరీ కోనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది గిరిజన సహకార సంస్థ వారపు సంతలోని కనీసం పసుపు, మిరియాల ధరలు కూడా ప్రకటన చేయలేదని, అది చేసి ఉంటే మరింత ధర పలుకుతుందని గిరిజన రైతులు చెబుతున్నారు.

Similar News

News January 11, 2026

జీవీఎంసీ బడ్జెట్ రెడీ… రేపు స్థాయి సంఘంలో చర్చ!

image

జీవీఎంసీ బడ్జెట్ తుదిమెరుగులు దిద్దారు. కమిషనర్ కేతన్గర్, మేయర్ శ్రీనివాసరావు కలిసి బడ్జెట్ రూపకల్పన చేయగా 13 పద్దుల కింద రూ.2064.73 కోట్లు ఆదాయం అని అంచనా వేశారు. జీవీఎంసీకి సొంతంగా అన్ని విభాగాల నుంచి 1749.68 కోట్లు సమకూర్తున్నట్లు బడ్జెట్‌లో చూపించారు. బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాలను సోమవారం జరిగే స్థాయి స్థానం సమావేశంలో సభ్యులతో సలహాలు తీసుకొని తుది మార్పులు చేసి ఆమోదం తెలపనున్నారు.

News January 11, 2026

విశాఖ: 20 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) మొత్తం 20 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3 విభాగంలో 06, టైప్-4 విభాగంలో 14 నాన్ టీచింగ్ పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.

News January 11, 2026

ఆనందపురంలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే

image

ఆనందపురం మండలంలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.950-1000 ఉండగా.. చికెన్ (స్కిన్ లెస్) కేజీ రూ.300గా ఉంది. విత్ స్కిన్ కేజీ రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. శొంఠ్యాం కోడి కేజీ రూ.310గా ఉంది. అలాగే డజన్ గుడ్లు రూ.90కి కొనుగోలు చేస్తున్నారు. గత వారంతో పోల్చుకుంటే దాదాపు అన్ని రేట్లు కాస్త పెరిగాయని వినియోగదారులు తెలిపారు.