News February 20, 2025
మేడ్చల్: BRS పార్టీకి ఎన్నికల్లో నిలబడే ముఖం లేదు: ఈటల

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ HNK కమలానగర్లో మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు BRS పార్టీ అభ్యర్థులను నిలబెట్టే సాహసం చేయలేదని, గత ప్రభుత్వంలో వారు విద్యార్థులను ఇబ్బందులు పెట్టారన్నారు. ఐదు డీఏలు ఇవ్వలేదని, 317జీవోను సవరించలేదని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వలేక, వారికి పోటీ చేసే ముఖం లేదన్నారు. ఈ నెల 27న ఎన్నికలు జరగబోతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 06, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 6, 2025
జగిత్యాల: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం..!

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు మగబాబు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News November 6, 2025
KNR: స్థానిక సమరం ఎప్పుడు..? బైపోల్ ప్రచారంలో బిజీగా పెద్దలు

BCరిజర్వేషన్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, ఎన్నికలను ఎప్పుడనే విషయాన్ని ఈనెల 24లోపు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. CM, మంత్రులు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బిజీగా ఉండటంతో ప్రకటన మరింత ఆలస్యం కానుంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,216 GPలు, 60 ZPTCలు, 646 MPTC స్థానాలున్నాయి.


