News February 20, 2025

భూపాలపల్లిలో దారుణ హత్య.. భూ వివాదమే కారణమా?

image

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 5, 2025

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై NRPT కలెక్టర్ సమీక్ష సమావేశం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్‌తో కలిసి అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటర్ల జాబితాలు, భద్రతా ఏర్పాట్లు వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

News July 5, 2025

పట్టుబిగించిన భారత్.. లీడ్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఇంగ్లండ్‌ను 407కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 64 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 244 పరుగుల లీడ్‌లో ఉంది. రాహుల్ 28*, కరుణ్ 7* క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్మిత్ 184*, బ్రూక్ 158 రన్స్‌తో అదరగొట్టారు.

News July 5, 2025

రాజాపేట: డైనింగ్ హాల్‌ను చూసి భయమేసింది: జిల్లా అధికారి

image

రాజాపేట మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శోభరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పప్పు కూరలో పోపు సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్‌ను చూసి భయమేసిందని, ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి సున్నం వేయాలన్నారు. లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. చదువుకునేందుకు కొన్ని అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓను కోరారు.