News February 20, 2025

జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు

image

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో YCP నేతలు సమావేశమయ్యారు. నిన్న గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా మాజీ CM జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిపారు. జగన్ రక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.

Similar News

News October 29, 2025

తుఫాన్ నష్టంపై వేగంగా అంచనాలు: లోకేశ్

image

AP: ‘మొంథా’ ప్రభావంతో జరిగిన నష్టంపై వేగంగా ప్రాథమిక అంచనాలు రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి, చెట్లు కూలి కరెంటు నిలిచిపోయిందని చెప్పారు. విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయాన్ని అందించాలని సూచించారు.

News October 29, 2025

నేను చిరు మూవీలో నటించట్లేదు: మాళవిక

image

చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని హీరోయిన్ మాళవికా మోహనన్ ఖండించారు. ‘ఏదో ఒకరోజు చిరంజీవి సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. అయితే మెగా158లో నటిస్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News October 29, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి

image

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్‌తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.