News February 20, 2025
అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లాకు 2 పతకాలు

ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థులు రెండు పతకాలు సాధించారు. కొండపాక సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు చెందిన నగేష్ అండర్- 20 బాలుర విభాగం జావెలిన్ త్రో లో వెండి పతాకం, మెరీడియన్ పాఠశాల చెందిన సిరి చందన అండర్-16 బాలికల షాట్ పుట్లో కాంస్య పతాకం సాధించారని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ తెలిపారు.
Similar News
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News July 6, 2025
సూళ్లూరుపేట: ఐటీయూ డైరెక్టర్ పదవికి నామినేషన్

ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డు డైరెక్టర్గా భారత అభ్యర్థిగా సూళ్లూరుపేటకు చెందిన రేవతి మన్నెపల్లిని కేంద్రం నామినేట్ చేసింది. ఇస్రో, బార్క్ వంటి సంస్థల్లో సేవలందించిన ఆమె ప్రస్తుతం జెనీవాలో సభ్యురాలిగా ఉన్నారు. రేవతి JNTUHలో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోకు చెందిన షార్ కేంద్రంలో ఇంజినీర్గా పనిచేశారు. ASLV, PSLV రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు.
News July 6, 2025
సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.