News February 20, 2025

విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: ERC

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని విద్యుత్ నియంత్రణ మండలి(ERC) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 ఏడాదికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఛార్జీల టారిఫ్‌లను విడుదల చేసిన ఆయన, ఏ విభాగంలోనూ ఛార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 31లోపు టారిఫ్‌లు విడుదల చేయాల్సి ఉండగా, ముందుగానే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.

Similar News

News February 22, 2025

iPhone ప్రైవసీపై ద్వంద్వ ప్రమాణాలు.. మీ కామెంట్

image

యూజర్ల ప్రైవసీపై పాఠాలు చెప్పే APPLE ఇప్పుడు బ్రిటన్లో క్లౌడ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ తొలగించడం సంచలనంగా మారింది. దాని ద్వంద్వ ప్రమాణాలపై చర్చ జరుగుతోంది. గతంలో కొన్ని కేసుల్లో నిందితుల iPhones అన్‌లాక్ చేయాలని ED, CBI దానిని కోరాయి. అప్పుడేమో తమ ప్రైవసీ రూల్స్ ప్రకారం కుదరదని తెగేసి చెప్పింది. ఇప్పుడేమో ఇన్వెస్టిగేషన్లకు ఇబ్బందులు వస్తున్నాయని UK అడగ్గానే ADP ఫీచరే తొలగించింది. దీనిపై మీ కామెంట్.

News February 22, 2025

పాముvsముంగిస.. పోరులో దేని బలమెంత?

image

పాము, ముంగిసలకు శత్రుత్వం ఉందని మనం వింటూ ఉంటాం. దీనికి కారణం ముంగిస పిల్లలను పాములు తినడమేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే అవి కనిపించగానే ఆడ ముంగిసలు దాడి చేస్తాయంటున్నారు. ‘చురుకుదనమే ముంగిసల బలం. అనుభవం లేనివి కూడా పాములు, కోబ్రాలను ఓడించగలవు. ఒక్కదెబ్బతో చంపగలవు. ఓ మోతాదు విషాన్ని అవి తట్టుకోగలవు. అత్యంత విషపూరితమైన పాము కాటు మాత్రమే ముంగిసను చంపగలదు’ అని చెబుతున్నారు.

News February 22, 2025

SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?

image

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం దోమలపెంటలోని 14వ కిలోమీటర్ వద్ద ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఎడమవైపు సొరంగం వద్ద మళ్లీ పనులు ప్రారంభం కాగా, ఇవాళ ఉదయం పైకప్పు కూలింది. ఇందులో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.

error: Content is protected !!