News March 21, 2024
ఆదిలాబాద్-మహారాష్ట్ర బార్డర్లో హై అలర్ట్

మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు హతమవ్వగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు.
Similar News
News October 23, 2025
5K రన్ విజయవంతం చేయండి: ఆదిలాబాద్ SP

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరుల జ్ఞాపకార్ధం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు 5k రన్ నిర్వహించనున్నట్లు SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ప్రజలు, యువత, విద్యార్థులు, పోలీసు శ్రేయోభిలాషులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వినాయక చౌక్, నేతాజీ చౌక్, అంబేడ్కర్ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం చేరుకుంటుందన్నారు.
News October 23, 2025
ఆదిలాబాద్: ’26లోపు కొటేషన్లు సమర్పించాలి’

ADB జిల్లాలోని15 ప్రీ-ప్రైమరీ పాఠశాలల కోసం ఫర్నీచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ మెటీరియల్ పెయింటింగ్ పని, కొనుగోలు నిమిత్తం స్థానిక ఫర్ముల నుంచి సీల్ చేసిన కోటేషన్లకు ఆహ్వానిస్తున్నట్లు DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఆసక్తి గల స్థానిక ఫర్ములు లేదా సరఫరాదారులు, సంబంధిత వివరాల అవసరాల జాబితా కోసం డీఈఓ క్వాలిటీ కోఆర్డినేటర్ ను సంప్రదించాలన్నారు. కోటేషన్లు ఈనెల 26లోపు సమర్పించాలన్నారు
News October 23, 2025
ఉట్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్ పల్లి ఐబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఎదురెదురుగా బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన అంకన్నతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.