News February 20, 2025
మామడ: మహిళ దారుణ హత్య

NZBజిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్కు చెందిన మహిళ హత్యకు గురైంది. పోలీసుల ప్రకారం.. మహిళకు భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను జనవరి 21న నిర్మల్ జిల్లా మామడకు రప్పించాడు. దిమ్మదుర్తి, నల్దుర్తి మార్గంలోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నిందితుడిని రిమాండ్కి తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
Similar News
News September 13, 2025
విజయవాడ నుంచి పలాసకు సూపర్ లగ్జరీ బస్సులు

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుండి పలాసకు ప్రతి రోజూ సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 2.30, సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సులు మరుసటి రోజు ఉదయం 4, 7.30కు పలాస చేరుకుంటాయని, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.20, 6,15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6, 7 గంటలకు విజయవాడ చేరుకుంటాయని, ప్రయాణికులు ఈ సర్వీసులను ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
News September 13, 2025
VJA: ఫుడ్ పాయిజనే కారణమా?

బయట వేయించిన చికెన్, చేపలు, ఇతర ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి డయేరియా వ్యాప్తికి కారణమని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇవి బాధితులు చెప్పిన విషయాలు మాత్రమేనని, నిర్ధారణ కోసం పంపిన ఫుడ్ శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రాలేదని సమాచారం. డయేరియా అదుపులోనే ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపిణలూ వినిపిస్తున్నాయి. కేసులు పెరుగుతున్నా అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
News September 13, 2025
పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకున్న కొత్త కలెక్టర్

ఇటీవల బదిలీపై పార్వతీపురం మన్యం జిల్లాకు కలెక్టర్గా నియమించబడ్డ ప్రభాకర్ రావు కలెక్టరేట్కు శనివారం చేరుకున్నారు. ఆయనకు పలువురు అధికారులు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో సమస్యలు గుర్తించి వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తామన్నారు.