News February 20, 2025
సిరిసిల్ల: డైరీ ప్లాంట్ మూసివేత: కలెక్టర్

సరైన అనుమతులు లేకపోవడంతో కరీంనగర్ డైరీ ప్లాంట్ మూసివేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల కలెక్టరేట్లో గురువారం ప్రకటన విడుదల చేశారు.వేములవాడ మండలం అగ్రహారంలోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ డైరీ ప్లాంట్ కు సరైన అనుమతులు లేకపోవడంతో ప్రమాద నివారణ చర్యలలో భాగంగా తాత్కాలికంగా మూసివేసినట్ల స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News September 19, 2025
గజ్వేల్: కొమ్మ కొమ్మకో గూడు..

గజ్వేల్లో ఈత చెట్టు కొమ్మలకు ఉన్న గూళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు అద్భుత నైపుణ్యంతో కట్టుకున్న ఈ గూళ్లు వద్ద సందడి చేస్తున్నాయి. ఈ దృశ్యం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. గజ్వేల్ పట్టణం నుంచి సంగాపూర్ వెళ్లే దారిలో గజ్వేల్ బాలికల విద్యాసౌధం సమీపంలో ఈత చెట్టు కొమ్మలకు పక్షులు కట్టుకున్న గూళ్లు కనువిందు చేస్తున్నాయి.
News September 19, 2025
దర్శి: విద్యార్థి మృతి.. బస్సుల నిలిపివేత

దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ముగ్గురిని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చౌటపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థి యేసురాజు(17) మృతిచెందాడు. దీంతో ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సులను గ్రామం నుంచి పంపించబోమన్నారు.
News September 19, 2025
భద్రాద్రి: పాపడలా జలపాతం.. పర్యాటకుల సందడి

మణుగూరు సమీపంలోని రథం గుట్టపై ఉన్న ‘స్వప్న జలపాతం’ చూపరులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతున్న ఈ జలపాతం నుదుటిన పెట్టుకునే ‘పాపడబిళ్ల’లా కనిపిస్తుందని పర్యాటకులు అంటున్నారు. జలపాతాన్ని సందర్శించేందుకు అనువైన మార్గం లేదని.. ప్రభుత్వం స్పందించి రహదారి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
PC: MANUGURU_UPDATES