News February 20, 2025
వనపర్తి: కంటి పరీక్షల కేంద్రాన్ని సందర్శించిన DMHO

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దృష్టిలోపం నివారణ కోసం చేపట్టిన కంటి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వనపర్తి డీఎంహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. గురువారం వనపర్తి జిల్లా ఆసుపత్రిలో కంటి వైద్యులు విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రెండో విడతలో విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షలను త్వరలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
Similar News
News September 18, 2025
కొత్తగూడెం- భద్రాచలం మధ్య ఎయిర్పోర్టుకు స్థలాలు..?

కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈసారి భద్రాచలం- కొత్తగూడెం మధ్య ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు ప్రభుత్వం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు, మూడుచోట్ల స్థలాలను గుర్తించగా, వాటిలోఒకటి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<