News February 20, 2025
ఎంఎస్ఎంఈ సర్వే తనిఖీ చేసిన: కలెక్టర్

నందిగామలో ఎంఎస్ఎంఈ సర్వే పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ గురువారం తనిఖీ చేశారు. అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సర్వేను విస్తృత స్థాయిలో చేపట్టడం జరుగుతోందని, ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని అయన కోరారు.
Similar News
News January 2, 2026
జగిత్యాల: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: ఎస్పీ

జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, చౌరస్తాలు, బస్టాండ్లలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
News January 2, 2026
శబరిమల బంగారం చోరీ.. CBI దర్యాప్తు అవసరం లేదు: కేరళ CM

శబరిమల బంగారం చోరీ కేసులో CBI దర్యాప్తు డిమాండ్లను కేరళ CM విజయన్ తోసిపుచ్చారు. SIT దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతోందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలర్, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాశ్, ఆంటోని కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు.
News January 2, 2026
భూపాలపల్లి: కొత్త సంవత్సరం పూట.. ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు!

కొత్త సంవత్సరం పూట ఆ ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు వచ్చారు. ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. BHPL జిల్లా నేరేడుపల్లికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో జిల్లాకేంద్రంలోని 100 పడకల ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరు కవలల(ఆడపిల్లలు)కు జన్మనిచ్చింది. న్యూ ఇయర్ రోజు కవలలు పుట్టడంతో కుటుంబ సభ్యలు సంతోషంలో మునిగిపోయారు.


