News February 20, 2025

పోలవరంపై కేంద్రమంత్రికి ఎంపీ సానా సతీష్ విజ్ఞప్తి

image

పోలవరం ప్రాజెక్టు పనులు పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లతో కలిసి సతీష్ బాబు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్‌ను గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని కాకినాడలోని ఎంపి కార్యాలయ ప్రతినిధులు మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

Similar News

News September 16, 2025

కర్నూలు జిల్లాలో 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయి..!

image

మెగా డీఎస్సీకి అర్హత గల అభ్యర్థులు లేకపోవడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 88 టీచర్ పోస్టులు మిగిలిపోయాయని DEO శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 64, మున్సిపల్ కార్పొరేషన్ 7, మున్సిపాలిటీ పరిధిలో 12, ట్రైబల్ /చెంచుల విభాగంలో 5 ఐదు పోస్టులు భర్తీకి నోచుకోలేదన్నారు. టీచర్ పోస్టుల భర్తీ తుది జాబితా https://www.deokrnl13.blogspot.comలో అందుబాటులో ఉంచామన్నారు

News September 16, 2025

ప్రకాశం: రాక్సీ వచ్చేసింది.. గంజా నేరగాళ్లకు ఇక చుక్కలే.!

image

నేరాల నియంత్రణలో పోలీస్ జాగిలాలు నిర్వహించే విధులను అభినందించాల్సిందే. అలాంటి చురుకైన జాగిలం రాక్సీ ప్రకాశం పోలీసుల చెంతకు చేరింది. ప్రత్యేక శిక్షణతో గంజాయిని వాసనతో పసిగట్టడం దీని ప్రత్యేకత. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రాక్సీని పోలీసులు రంగంలోకి దించారు. తొలి ప్రయత్నంలోనే గంజా ముఠా ఆటకట్టించింది. <<17720866>>సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో<<>> రాక్సీ సైలెంట్‌గా గంజాయి బ్యాగులను గుర్తించింది.

News September 16, 2025

TPT : కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ప్రాజెక్టు అసోసియేట్-01, ప్రాజెక్ట్ అసిస్టెంట్-01, డేటా ఎంట్రీ ఆపరేటర్ -01 మొత్తం 3 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs.html వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 27.