News February 21, 2025

జగిత్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

@ జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల ప్రచారం @ మేడిపల్లి, కోరుట్లలో పర్యటించిన కలెక్టర్ @అదనపు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్కిల్ కమిటీ సమావేశం @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆదాయం వివరాలు @ ధర్మపురిలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి @ కొడిమ్యాల: క్రీడలలో విద్యార్థినుల ప్రతిభ.. ఎస్పీ ప్రశంసా @ చెగ్యంలో ఘనంగా ముగిసిన మల్లన్న బోనాలు @ వెల్గటూరు ZPHSలో తరగతి గదిని పరిశీలించిన DEO రాము.

Similar News

News February 22, 2025

గద్వాల: కరెంట్ షాక్‌తో జూనియర్ అసిస్టెంట్ మృతి

image

కరెంట్ షాక్‌తో గట్టు మండలంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని గంగిమాన్‌దొడ్డికి చెందిన బోయ రాము(39) ధరూర్ తహశీల్దారు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన కొత్త ఇంటికి నీళ్లు పట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురై మ‌ృతిచెందారు. కుటుంబంలో యజమానిని కోల్పోవడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 

News February 22, 2025

విశాఖ: షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య

image

అనకాపల్లి గవరపాలెం సాగిదుర్గరాజు వీధిలో ఈనెల 19న ఆత్మహత్యకు ప్రయత్నించిన మంగారపు జ్యోతి(29) చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త షేక్ అబ్దుల్ ఘనితో కలిసి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. 19న తనను బయటకు తీసుకెళ్లాలని భార్య కోరింది. ఇప్పుడు బయటకు ఎందుకని ఆమె తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురై మేడపైకి వెళ్లి ఉరేసుకుంది. వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.

News February 22, 2025

కేంద్ర మంత్రికి విరిగిన కుర్చీ.. ఎయిర్ ఇండియాపై ఆగ్రహం

image

ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తనకు విమానంలో విరిగిన కుర్చీ కేటాయించారని మండిపడ్డారు. డబ్బు తీసుకుని ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నారని, ఇది వారిని మోసం చేయడమేనని దుయ్యబట్టారు. టాటా టేకోవర్ తర్వాత కూడా సంస్థ తీరు మారలేదన్నారు. దీంతో ఎయిర్ ఇండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంది.

error: Content is protected !!