News February 21, 2025
ADB: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: కలెక్టర్

జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవితోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2025
ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ADB జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.
News February 22, 2025
ADB: ముస్లిం ఉద్యోగులకు GOO NEWS

రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31 వరకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయ విధులు నిర్వహించుకొని ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నమాజ్, రోజా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
News February 22, 2025
ఆదిలాబాద్లో బాలికపై అత్యాచారం

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ కాలనీలో 13 ఏళ్ల మైనర్ బాలికపై శుక్రవారం అత్యాచారం చేయడంతో బాలిక తరఫు వారి ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. బాలికను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రిమ్స్ వద్ద స్థానికులు పెద్దఎత్తున గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రిమ్స్కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.