News February 21, 2025
గద్వాల: ఉపాధి హామీలో పని కల్పించాలి: కలెక్టర్

జాబ్ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. గురువారం గట్టు మండలంలోని మండల మహిళా సమాఖ్య భవనాన్ని ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. జాబ్కార్డు సృష్టి, డేటా ఎంట్రీ వివరాలను, రిజిస్టర్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో చర్చించి, ఉపాధి హామీ పనుల అమలుపై స్పష్టమైన సూచనలు అందించారు.
Similar News
News September 17, 2025
KMR: మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే..

మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జరిమానాలు, జైలు శిక్షలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి కోర్టు మంగళవారం రూ.21,000 జరిమానా విధించింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తికి కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. ‘మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News September 17, 2025
కొత్తగూడెం: హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

ఓ హత్య కేసులో నిందితుడైన పల్లం సాయికుమార్కు పదేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్కు చెందిన బడికల సంతోష్ను సాయికుమార్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హత్య చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోర్టుకు ఆధారాలు సమర్పించగా, నేరం రుజువైనట్టు తేలింది. కేసు ఛేదించిన పోలీసులను SP అభినందించారు.
News September 17, 2025
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: పవన్

AP: సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, SPల సదస్సులో Dy.CM పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం. CM చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి’ అని ఆదేశించారు.