News February 21, 2025

పా.గో: గవర్నర్‌కు మాజీ మంత్రుల వినతులు

image

వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైయస్ జగన్‌కి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Similar News

News February 22, 2025

పెనుగొండ: చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ 

image

పెనుగొండలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఒక రోజులోనే ఛేదించారు. పెనుగొండలో గుబ్బల లక్ష్మీనారాయణ కుటుంబం షిరిడీ వెళ్లడంతో విషయం తెలుసుకొని చోరీకి పాల్పడ్డారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో చిన్నంవారిపాలెం వద్ద నివాసం ఉంటున్న కె. పోతురాజు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. అతని నివాసం వద్ద తనిఖీ నిర్వహించి 49 ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నయీమ్ ఆచంటలో వివరించారు.

News February 22, 2025

పాలకొల్లు: జగన్‌కు సవాలు విసిరిన మంత్రి నిమ్మల

image

వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరు వక్రీస్తున్నారో ప్రజా క్షత్రంలో తెల్చుకుందామని, మాజీ సీఎం జగన్‌కు మంత్రి నిమ్మల శుక్రవారం సవాల్ విసిరారు. పోడూరు మండలం జిన్నూరులో రూ.3 కోట్లతో చేపట్టిన ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..వెలిగొండ ప్రజెక్ట్‌ను మూడుసార్లు సందర్శించాను. ప్రాజెక్ట్ పూర్తికాలేదని జగన్ ఒప్పుకున్నట్లైతే జాతికి ఎలా అంకితమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

News February 21, 2025

మొగల్తూరు : పేరుపాలెం బీచ్ సమీపంలో వ్యక్తి సూసైడ్

image

పేరుపాలెం బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపిన వివరాలు.. రిసార్ట్ సమీపంలోని సీఆర్ జెడ్ పరిధిలోని తోటలో గుళికలు తిని మృతిచెందాడు. అయితే అతని జేబులో ఓ మహిళకు సంబంధించిన పాన్ కార్డు ఉందని , ఫోన్ లాక్ ఓపెన్ కాలేదని వీఆర్వో దుర్గారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడిది కృష్ణా జిల్లా కృతివెన్నుగా అనుమానిస్తున్నారు.

error: Content is protected !!